కరెన్సీనగర్, న్యూస్టుడే: విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కన్వీనర్ కోటా ద్వారా భర్తీ కాని సీట్లకు అక్టోబరు 13న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ విజయసారథి ఒక ప్రకటనలో తెలిపారు. పాలిసెట్ రాసి ఎక్కడా సీటు పొందని వారు, ప్రవేశపరీక్ష రాయకున్నా.. పది, ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ కౌన్సెలింగ్కు అర్హులు. అభ్యర్థులు అక్టోబరు 12వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకుని, 13న ఉదయం 10 గంటలకు ఒరిజనల్ ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్కు హాజరుకావాలి. ప్రస్తుతం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, మెటలర్జీ కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.