• facebook
  • whatsapp
  • telegram

Campus Placements: ప్రాంగణ నియామకాల్లో నిట్‌ విద్యార్థుల సత్తా

అత్యధికంగా రూ.88 లక్షల ప్యాకేజీ
ఈనాడు, వరంగల్‌: వరంగల్‌ ఎన్‌ఐటీ విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఆకర్షణీయ ప్యాకేజీలు సాధిస్తున్నారు. అనూహ్య వేతనాలతో ఆశ్చర్యపరుస్తున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన విద్యార్థులు అత్యధిక ప్యాకేజీనీ అందుకుంటున్నారు.
 ప్రస్తుత ప్రాంగణ నియామకాల్లో ఆదిత్యసింగ్‌ అనే విద్యార్థి రూ.88లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇది ఎన్‌ఐటీ చరిత్రలోనే అత్యధికం. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అతన్ని ఎంపిక చేసుకుంది. ఆదిత్య స్వస్థలం దిల్లీలోని ఫరీదాబాద్‌. తండ్రి న్యాయవాది, తల్లి ఉపాధ్యాయురాలు. కష్టపడే తత్వమే తనకింత మంచి అవకాశం తెచ్చిపెట్టిందని ఆదిత్య తెలిపారు. గత సంవత్సరం ఎన్‌ఐటీలో అత్యధిక వార్షిక ప్యాకేజీ రూ.62.5 లక్షలు. వెయ్యి మందికి పైగా విద్యార్థులు చక్కని ప్యాకేజీలతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈసారి ఎక్కువ మంది కొలువులు సాధిస్తున్నారని సంచాలకుడు ఆచార్య ఎన్‌.వి.రమణారావు తెలిపారు.
 ఈ ఏడాది కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన సుశీత్‌ అనే మరో విద్యార్థి రూ.75లక్షలు, ఇదే బ్రాంచికి చెందిన సుఫియాన్‌ రూ.62.75 లక్షల ప్యాకేజీ సాధించారు. ఈఈఈ విభాగంలో సౌరవ్‌ అనే విద్యార్థి రూ.51లక్షల ప్యాకేజీకి ఎంపికయ్యారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.