మాచవరం, న్యూస్టుడే: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మాచవరంలోని ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అక్టోబరు 21న జాబ్ ఫెయిర్ నిర్వహిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ పి.నరేష్ తెలిపారు. ఎస్సీ, ఇంటర్, ఐటీఐ డిప్లొమా, బీటెక్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫార్మసీ అర్హతగల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ జాబ్ ఫెయిర్లో పలు రంగాలకు సంబంధించిన 15 కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. మరిన్ని వివరాలకు 77996 69907, 90326 33548 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఏఐ - ఎంఎల్ ఎందుకు నేర్చుకోవాలి?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.