ఈనాడు, అమరావతి: ఈఏపీసెట్ ఎంపీసీ స్ట్రీమ్ రెండో విడత కౌన్సెలింగ్లో 11,408 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 19,959 మంది కళాశాలలు, కోర్సులను మార్పు చేసుకున్నారు. రెండో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు వివరాలను అక్టోబరు 28న కన్వీనర్ నాగరాణి విడుదల చేశారు. మొదటి, రెండో విడత కలిపి మొత్తం 82.2 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కలిపి కన్వీనర్ కోటాలో 1,12,696 సీట్లు ఉండగా, ఇందులో 92,661 సీట్లు నిండాయి. క్రీడల కోటాకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కానందున 491 మందికి సీట్ల కేటాయింపు పూర్తి చేయలేదు. ఈఏపీసెట్లో 1,73,572 మంది అర్హత సాధించగా, కౌన్సెలింగ్కు 1,04,806మంది రిజిష్టర్ చేసుకున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.