గాడి తప్పిన అకడమిక్ క్యాలెండర్
ఇంకా పూర్తి కాని పీజీ, పీహెచ్డీ ప్రవేశాలు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ)లో అకడమిక్ క్యాలెండర్ అస్తవ్యస్తంగా తయారైంది. పీజీ ప్రవేశాలు పూర్తికాక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి యూజీసీ నిర్వహించిన ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)లో హెచ్సీయూ చేరింది. పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యమైంది.
సెమిస్టర్ నిర్వహణ ఎలా?
కరోనా నుంచి తేరుకుని అన్ని విద్యాసంస్థలు అకడమిక్ క్యాలెండర్ సర్దుబాటు చేసేందుకు యత్నిస్తుండగా.. హెచ్సీయూలో భిన్నమైన పరిస్థితులున్నాయి. ఇటీవల డీన్స్ సమావేశంలో, సెమిస్టర్ను తగ్గించేద్దామని వీసీ చేసిన ప్రతిపాదనపై ఆచార్యులు మండిపడుతున్నారు. మరోవైపు యూనివర్సిటీ సొంతంగా పీహెచ్డీ ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవాలని యూజీసీ చెప్పేవరకు హెచ్సీయూ అధికారులు మేల్కొనలేదు. ఈలోపు చాలా వర్సిటీలు సొంతగా పరీక్ష నిర్వహించడంతో విద్యార్థులు అటు వెళ్లిపోయారు.
స్కూల్ విభజనపై కొర్రీలు
వర్సిటీలోని సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ రెండు విభాగాలుగా చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించినా, అనూహ్యంగా వీసీ నిలిపేశారు. అకడమిక్ ఆడిట్ చేసి నివేదిక ఇచ్చినా పట్టించుకోకుండా.. తిరిగి కమిటీ వేద్దామంటూ ప్రతిపాదించారు.
డిజిటల్ కోర్సుల ఊసేదీ?
జాతీయ విద్యా విధానం ప్రకారం 40 శాతం కోర్సులు ఆన్లైన్లో నిర్వహించాలని యూజీసీ సూచిస్తున్నా, ఆ దిశగా అడుగుపడలేదు. డిజిటల్ లెర్నింగ్ సెంటర్ వినియోగంలోనూ వర్సిటీ అధికారులు విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. ఇంటర్నేషనల్ వ్యవహారాల విభాగం నియామకాల్లోనూ కొందరికే అందలం వేశారన్న విమర్శలున్నాయి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పారిశ్రామిక భద్రతా దళంలోకి స్వాగతం!
‣ డెవాప్స్ నిపుణులకు డిమాండ్!
‣ కోస్టుగార్డు కొలువుల్లోకి ఆహ్వానం!
‣ 20,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.