• facebook
  • whatsapp
  • telegram

Skill Training: విద్యార్థులకు చదువుతోపాటు నైపుణ్య శిక్షణ

* పాలీటెక్‌ ఫెస్ట్‌ ప్రారంభ సభలో మంత్రి బొత్స 
 

ఈనాడు, అమరావతి: విద్యార్థులకు చదువుతోపాటు నైపుణ్య శిక్షణను అందిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్‌లోనూ మార్పులు తీసుకొస్తున్నామని, విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. విజయవాడలో 3 రోజులపాటు జరగనున్న పాలీటెక్‌ ఫెస్ట్‌ను నవంబర్‌ 24న ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘పాలిటెక్నిక్‌ విద్యార్థులు విభిన్న ప్రయోగాత్మక ప్రాజెక్టులను ఆవిష్కరించడం అభినందనీయం. బ్లూటూత్‌ టెక్నాలజీ ద్వారా జ్యోతిని వెలిగించడం అధునాతన సాంకేతికతకు అద్దం పడుతోంది. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి. లేదంటే జీవితంలో ఏమి సాధించలేరు’ అని పేర్కొన్నారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు, ఉపాధి, శిక్షణశాఖ డైరెక్టర్‌ లావణ్య వేణి పాల్గొన్నారు. 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.