• facebook
  • whatsapp
  • telegram

Medical education: విదేశాల్లో వైద్యవిద్య చదివిన విద్యార్థులకు రాష్ట్రంలో ఇంటర్న్‌షిప్‌

 

ఈనాడు, హైదరాబాద్‌: రష్యా, చైనా, ఫిలిప్పిన్స్‌, ఉక్రెయిన్‌ తదితర పరిమిత దేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌నకు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. చైనాలో కరోనా కారణంగా.. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కారణంగా ఆయా దేశాల్లో ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసుకోని విద్యార్థులకు దీనివల్ల లబ్ధి చేకూరనుంది. అయితే ఆయా దేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులు తప్పనిసరిగా భారత్‌లో నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి(టీఎస్‌ఎంసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటనను ఒకట్రెండు రోజుల్లో వెలువరిస్తామని, ఈ మేరకు ఎన్‌ఎంసీ నుంచి ఆదేశాలు అందాయని టీఎస్‌ఎంసీ రిజిస్ట్రార్‌ హనుమంతరావు తెలిపారు.
 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎన్‌సీఎల్‌  405 ఉద్యోగాలు! 

‣ స‌మూహంలో స‌త్తా చూపించండి!  

‣ ఎడ్యుకేష‌న్ లోన్‌ ఎలా తీసుకోవాలి? 

‣ స‌గం ప్ర‌శ్న‌లు స‌రిగా రాస్తే చాలు! 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.