ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: సీఎస్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కోరారు. రాష్ట్ర యువతకు స్థానికంగానే కాకుండా విదేశాల్లోనూ ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దీనిని సద్వినియోగం చేసుకొని రాష్ట్రానికి పేరు తేవాలన్నారు. తెలంగాణ విదేశీ మానవ వనరుల సంస్థ(టామ్కామ్) ఆధ్వర్యంలో జపాన్లో నర్సింగ్ ఉద్యోగార్థుల కోసం చేపట్టిన నర్సింగ్ శిక్షణ కార్యక్రమాన్ని డిసెంబరు 27న ఆయన రాజేంద్రనగర్లోని గ్రామీణాభివృద్ధి సంస్థలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నర్సింగ్ ఉద్యోగాలకు భారీగా డిమాండ్ ఉందన్నారు. గౌరవప్రదమైన వేతనంతో పాటుగా మంచి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. నిరుద్యోగ యువతకు వీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని తెలిపారు. జపాన్లో ఉద్యోగాలకు వెళ్లేవారికి అక్కడి భాష, అనుదిన వ్యవహారాలు తెలిసేలా ఉండేందుకు శిక్షణ ఇస్తున్నట్లు సీఎస్ చెప్పారు. కార్యక్రమంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, పంచాయతీరాజ్, వైద్యఆరోగ్య శాఖల కార్యదర్శులు సందీప్కుమార్ సుల్తానియా, రిజ్వీ, పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, జపాన్ నావిష్ సంస్థ సీఈవో టకాకా ఒసిబుషిలు పాల్గొన్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ నాలుగేళ్ల డిగ్రీతో నేరుగా పీహెచ్డీ!
‣ ఊహలకు రూపమిస్తూ... ఉత్పత్తులు రూపొందిస్తూ!
‣ పవర్ గ్రిడ్లో కొలువు కావాలా?
‣ ఉన్నాయా మీకు ఈ ఉద్యోగ లక్షణాలు?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.