ఈనాడు, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాపూలె బీసీ విదేశీవిద్య పథకానికి ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. విదేశాల్లో పీజీ చదివేందుకు ఈ పథకం కింద అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జులై 1 నాటికి వయసు 35 ఏళ్ల దాటకూడదని, కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండి, డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు తెలంగాణ ఈ-పాస్ వెబ్సైట్ సందర్శించాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.