రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ
ఈనాడు, దిల్లీ: ఉపాధి, వృత్తి నైపుణ్యాల కల్పనకు వీలుగా ఉన్నత విద్యా విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ అన్నారు. విద్యా విధానం మార్పుల విషయంలో రాజీపడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దిల్లీలో ఇండియన్ డిడయాక్టిక్ అసోసియేషన్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్లు నాలెడ్జ్ కన్జర్వేషన్ ఆఫ్ గుజరాత్, ఇండియన్ పాలసీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 3న సదస్సు నిర్వహించారు. ఉన్నత విద్యా విధానం రోడ్ మ్యాప్ తయారీ తదితర అంశాలపై చర్చించారు. ‘‘సమాచార మార్పిడి, సృజనాత్మకత, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు ఉండాలి. మెరుగైన ఫలితాల కోసం పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని వెంకటరమణ అన్నారు. సదస్సులో తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాలకు చెందిన వైస్ ఛాన్సలర్లు పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కేంద్రీయ సంస్థల్లో యూజీ.. పీజీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.