• facebook
  • whatsapp
  • telegram

IITH: ఐఐటీహెచ్‌ ఆధ్వర్యంలో జాతీయస్థాయి యూత్‌ ఛాలెంజ్‌

‘మోడల్‌ జీ20 ఇనీషియేటివ్‌’ పేరిట వ్యాసరచన, వక్తృత్వ పోటీలు
దరఖాస్తుకు ఏప్రిల్‌ 14 వరకు అవకాశం

ఈనాడు, సంగారెడ్డి: జీ20 సమ్మిట్‌ను ఈసారి మన దేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఐఐటీ హైదరాబాద్‌.. ‘మోడల్‌ జీ20 ఇనీషియేటివ్‌’ పేరిట జాతీయస్థాయి యూత్‌ ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న డిగ్రీ, పీజీ, సాంకేతిక విద్యాసంస్థల విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందులోభాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ప్రగతి, వాతావరణ మార్పులు- దాని ప్రభావం, అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు, వ్యవసాయ రంగంలో డిజిటలైజేషన్‌, అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం, లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ తదితర అంశాల్లో తొలిదశలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. అందులో నుంచి మెరుగైన ఆలోచనలు, ప్రతిపాదనలను ఎంపిక చేసి.. జోన్‌ స్థాయిలో చర్చలు నిర్వహిస్తారు. చివరగా జాతీయస్థాయిలో వక్తృత్వ పోటీలు నిర్వహించి అత్యుత్తమంగా రాణించిన ఆరుగురు విద్యార్థులకు అవార్డులు అందిస్తారు. విజేతలకు రూ.15 లక్షల విలువ చేసే బహుమతులు ఇవ్వనున్నట్లు ఐఐటీ హైదరాబాద్‌ బుధవారం తెలిపింది. ‘‘ఇండియన్‌ నేషనల్‌ యంగ్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌తో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంతో అంతర్జాతీయ స్థాయిలో వివిధ అంశాల్లో విప్లవాత్మక సంస్కరణలు తేవడానికి అవకాశం ఉంటుంది’’ అని ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌మూర్తి తెలిపారు. ఈ ఛాలెంజ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 50 వేలకు పైగా కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొంటారని ఐఐటీ పరిశోధన విభాగం డీన్‌ చంద్రశేఖర్‌శర్మ వెల్లడించారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి అనుసరిస్తున్న విధానాలు తదితర అంశాలపై అవగాహన కలుగుతుందన్నారు.
ఈ పోటీల్లో పాల్గొనడానికి దరఖాస్తు చేయాల్సిన చివరి తేదీ ఏప్రిల్‌ 14. పూర్తి వివరాల కోసం  https://modelg20.iith.ac.in/ లో చూడొచ్చు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ పరిశ్రమల సంరక్షకులు!

‣ వచ్చేస్తున్నాయ్‌... వర్చువల్‌ ల్యాబ్స్‌!

‣ టెన్త్‌ మార్కులతో పోస్టల్‌ ఉద్యోగం!

‣ బీటెక్‌ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!

‣ కోస్ట్‌గార్డ్‌ కొలువు కావాలా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.