• facebook
  • whatsapp
  • telegram

Skills: విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలు పెంపొందించాలి: కమిషనర్‌

ఈనాడు, అమరావతి: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ అన్నారు. విద్య సమాజ మార్పునకు ఉపకరించే అత్యంత విలువైన ఆయుధమని, పరీక్షల్లో మార్కుల కంటే సృజనాత్మక ఆలోచనలు సృష్టించడమే ముఖ్యమని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష అభియాన్‌, రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అంకుర సాధికారిక అభివృద్ధి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసి, తీసుకొచ్చిన 52 ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లల్లో విజ్ఞాన నైపుణ్యాలను పెంపొందించాలని, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో 4,776 మంది విద్యార్థులు బృందాలుగా ఏర్పడి, తమ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించడం అభినందనీయమని తెలిపారు. విశాఖ జిల్లా అగనంపూడి పాఠశాలకు చెందిన సాయి, జయంత్‌, నరేంద్ర బృందానికి మొదటి బహుమతి, కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదముత్తేవి ఎస్‌ఎల్‌ఎస్‌ ఓరియంటల్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు మల్లీశ్వరి, మేరీజ్యోస్న, రామసీతకు ద్వితీయ, చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం గుతర్లపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన మీనా, అతిఫా, వర్షా జట్టుకు తృతీయ బహుమతి లభించాయి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.