ఈనాడు, అమరావతి: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటాలో 9,064 మందికి సీట్లు కేటాయించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ తెలిపారు. సీట్లు పొందిన వారు ఏప్రిల్ 25లోపు పాఠశాలల్లో చేరాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు పాఠశాలల్లో కలిపి 90 వేల వరకు సీట్లు ఉండగా.. 16 వేల మందికిపైగా దరఖాస్తు చేశారు. ఇందులో 14,888 మంది అర్హత సాధించగా, ఆవాసానికి కిలోమీటరు దూరం పరిధి ప్రకారం 9 వేల మందికి సీట్లు కేటాయించారు. ఈ ప్రక్రియ అనంతరం రెండో విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. దరఖాస్తులు తక్కువగా వచ్చినందున రెండోసారి స్వీకరించాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సుపరిపాలనకు.. సుస్థిర ప్రగతికి!
‣ ప్రాక్టికల్స్లో తప్పుతున్న 50% మంది ఎంబీబీఎస్ విద్యార్థులు
‣ రాష్ట్రంలోని పట్టభద్రుల్లో 35.14% మంది నిరుద్యోగులే
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.