• facebook
  • whatsapp
  • telegram

TS ICET: 12 వరకు ఐసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

ఈనాడు, హైదరాబాద్‌, కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించనున్న టీఎస్‌ ఐసెట్‌-2023 దరఖాస్తుల గడువు మే 12 వరకు పొడిగించినట్లు కన్వీనర్‌ పి.వరలక్ష్మి మే 7న‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6కే గడువు ముగియగా విద్యార్థుల వినతుల మేరకు ఆలస్య రుసుం లేకుండా 12 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అభ్యర్థులు రూ.250 ఆలస్య రుసుంతో మే 15 వరకు, రూ.500తో 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మే 26, 27 తేదీల్లో తెలంగాణలోని 16, ఏపీలోని 4 ఆన్‌లైన్‌ ప్రాంతీయ కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ తొలి తెలుగు చక్రవర్తులు

‣ నిజాం నిరంకుశత్వంపై సత్యాగ్రహం!

‣ ఈసారీ సుల‌భంగా నీట్‌

‣ షుగర్‌ టెక్నాలజీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.