ఈనాడు, హైదరాబాద్, కేయూ క్యాంపస్, న్యూస్టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించనున్న టీఎస్ ఐసెట్-2023 దరఖాస్తుల గడువు మే 12 వరకు పొడిగించినట్లు కన్వీనర్ పి.వరలక్ష్మి మే 7న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6కే గడువు ముగియగా విద్యార్థుల వినతుల మేరకు ఆలస్య రుసుం లేకుండా 12 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అభ్యర్థులు రూ.250 ఆలస్య రుసుంతో మే 15 వరకు, రూ.500తో 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మే 26, 27 తేదీల్లో తెలంగాణలోని 16, ఏపీలోని 4 ఆన్లైన్ ప్రాంతీయ కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నిజాం నిరంకుశత్వంపై సత్యాగ్రహం!
‣ షుగర్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.