• facebook
  • whatsapp
  • telegram

Medicine-Engineering: ఒకే కోర్సులో మెడిసిన్‌, ఇంజినీరింగ్‌

* ఐఐటీ మద్రాస్‌ వినూత్న ప్రయోగం

చెన్నై (ప్యారిస్‌), న్యూస్‌టుడే: దేశంలోనే తొలిసారిగా వైద్యవిద్య, ఇంజినీరింగ్‌ను కలిపి ఒకే కోర్సుగా ఐఐటీ మద్రాస్‌ తీసుకొచ్చింది. ఈ కోర్సును నాలుగేళ్ల బీఎస్‌ ప్రోగ్రాం కింద ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం మెడికల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగాన్ని కాగ్నిజెంట్ సహ వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణన్‌, ఐఐటీఎం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.కామకోటి మే 11న‌ ప్రారంభించారు. ప్రపంచస్థాయిలో అత్యున్నత మేధావుల ఆధ్వర్యంలో ఈ కోర్సుకు సంబంధించిన కరిక్యులమ్‌ తయారైందని వారు ప్రకటించారు. ఈ కోర్సుకు వన్నె తేవడానికి ప్రముఖ ఆసుపత్రులు, దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు  https://mst.iitm.ac.in/ వెబ్‌సైట్ చూడొచ్చని తెలిపారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎన్ని రెట్లు.. ఎన్నో వంతు!

‣ గ్రామర్‌ తెలిస్తే మార్కులు ఈజీ

‣ డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్‌లో ఉద్యోగాల భర్తీ

‣ షిప్పింగ్‌ కోర్సులతో మేటి అవకాశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.