* కొత్త బోధనాసుపత్రుల్లో పోస్టింగ్లు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో ఎంపికైన 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మే 15 నుంచి 19 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ రమేశ్రెడ్డి మే 12న ఒక ప్రకటనలో తెలిపారు. ‘హైదరాబాద్లోని వైద్య, విద్య డైరెక్టరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. 15, 16న మల్టీజోన్-1 అభ్యర్థులకు, 17, 18న మల్టీజోన్-2, 19న మల్టీజోన్-1, 2లకు చెందిన సూపర్ స్పెషాలిటీ అభ్యర్థులకు నిర్వహిస్తాం. సబ్జెక్టుల వారీగా కౌన్సెలింగ్ సమాచారం డీఎంఈ వెబ్సైట్లో ఉంది’ అని తెలిపారు.
* రాష్ట్రంలోని బోధనాసుపత్రుల 34 విభాగాల్లో 1,442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి గతేడాది డిసెంబరు 6న ప్రకటన ఇచ్చి 5 నెలల్లో ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తం 1,061 మందిని ఎంపిక చేశారు. రిజర్వేషన్ల మేరకు అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం, కొన్ని విభాగాల్లో దరఖాస్తులు తక్కువగా రావడం వంటి కారణాలతో 381 పోస్టులు భర్తీ కాలేదు. వీటిని తదుపరి నియామకాల్లో జత చేయనున్నారు. ఎంపికైన అసిస్టెంట్ ప్రొఫెసర్లను కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియమించనున్నారు. మే 22న మంత్రి హరీశ్రావు వారికి నియామకపత్రాలు అందజేయనున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ అతి విశాలం.. అత్యంత వైవిధ్యం!
‣ గ్రామర్ తెలిస్తే మార్కులు ఈజీ
‣ డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్లో ఉద్యోగాల భర్తీ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.