* నోటిఫికేషన్కు పదో తరగతి ఉత్తీర్ణుల నిరీక్షణ
బాసర, న్యూస్టుడే: నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) ప్రవేశాల కోసం విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. గతేడాది వరకు పదో తరగతి ఫలితాల కంటే ముందే నోటిఫికేషన్ విడుదల చేసేవారు. నెల రోజుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేసి తరగతులు ప్రారంభించేవారు. ఈసారి ఫలితాలు విడుదలై అయిదు రోజులవుతున్నా ప్రవేశాలు చేపట్టకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు కళాశాలల వారు ఇళ్ల వద్దకు వెళ్లి మీ పిల్లలను తమ కళాశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈసారి పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండటంతోపాటు అధిక మందికి 10 జీపీఏ రావడంతో ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు పోటీ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
వేరే చోట చేరితే ఇబ్బందులు
చాలామంది విద్యార్థులు ప్రైవేటు కళాశాలలు, ఇతర గురుకులాల్లో చేరుతున్నారు. యాజమాన్యాలు వారి ధ్రువపత్రాలు తీసుకోవడంతోపాటు ఫీజులు కట్టించుకుంటున్నాయి. వారికి తరువాత ఆర్జీయూకేటీలో సీటు వస్తే అక్కడ రద్దు చేసుకోవడం ఇబ్బందవుతుంది. ‘ప్రభుత్వ అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని. ఈసారి ఎంతమందికి ప్రవేశాలు కల్పించేది ఇప్పుడే చెప్పలేం’ అని ఆర్జీయూకేటీ ఉపకులపతి వెంకటరమణ తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.