73 శాతం మంది ఉద్యోగార్థుల మనోగతం
నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అప్నా.కో నివేదిక
ముంబయి: ప్రస్తుత ఆర్థిక అనిశ్చితులు, ఇటీవల అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో 73 శాతం మంది ఉద్యోగార్థులు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో పని చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు జాబ్స్ అండ్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అప్నా.కో నివేదిక వెల్లడించింది. స్థిరమైన, ఇప్పటికే బాగా విస్తరించిన కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి అక్కడే ఎదిగేందుకు ఆసక్తిగా ఉన్నామని పేరొన్నట్లు తెలిపింది. 10,000 మంది ఉద్యోగార్థులు, 1,000 మంది మానవ వనరుల రిక్రూటర్లను సర్వే చేసి ఈ నివేదికను రూపొందించినట్లు పేర్కొంది. కెరీర్లో వృద్ధి సాధించేందుకు అంకుర సంస్థల్లోకి మారతామని ఇప్పటికీ 27 శాతం మంది పేర్కొనడం గమనార్హం. ‘భారతీయ ఉద్యోగ విపణిలో ఉద్యోగార్థుల ఎంపికలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది స్థిరమైన ఉద్యోగాలను కోరుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే మంచి పేరున్న పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో పని చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నార’ని అప్నా.కో వ్యవస్థాపకులు, సీఈఓ నిర్మిత్ పారిఖ్ వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.