దేశవ్యాప్తంగా 21న నిర్వహణ
దిల్లీ: రెండో దశలో జరిగే కామన్ అండర్ గ్రాడ్యుయేషన్ పరీక్ష (క్యూట్)ను శాంతిభద్రతల సమస్య నేపథ్యంలో మణిపుర్లో మే 29న నిర్వహించనున్నారు. యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్కుమార్ ఈ మేరకు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను 21న నిర్వహిస్తున్నారు. మణిపుర్లో ఈ నెలారంభంలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో విద్యార్థులకు తేదీ మార్చుతూ వెసులుబాటు కల్పించారు. కేంద్రాన్ని మార్చుకోవడానికీ అవకాశమిచ్చారు.
జమ్మూకశ్మీర్లో మే 26కు వాయిదా
జమ్మూకశ్మీర్లో కామన్ అండర్ గ్రాడ్యుయేషన్ పరీక్ష (క్యూట్)ను మే 26కి వాయిదా వేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. ఇక్కడి విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని కేంద్రాలలో పరీక్షకు హాజరుకావాల్సిన అవసరం లేదని పేర్కొంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.