• facebook
  • whatsapp
  • telegram

Lateral Entry: ఖాళీ బీటెక్‌ సీట్ల భర్తీకి లేటరల్‌ ఎంట్రీ

* బాసర ఆర్‌జీయూకేటీ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: బాసర ఆర్‌జీయూకేటీలో ఇంటర్‌ చదివి, బీటెక్‌కు ఇతర కళాశాలల్లో చేరుతున్న నేపథ్యంలో ఆ సీట్లను ఈ విద్యాసంవత్సరం నుంచి లేటరల్‌ ఎంట్రీ ద్వారా భర్తీ చేయాలని వర్సిటీ నిర్ణయించింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ (రెండేళ్లు ఇంటర్‌, నాలుగేళ్లు బీటెక్‌)లో చేరుతున్నారు. ఇంటర్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులకు బీటెక్‌లో వివిధ బ్రాంచీలు కేటాయిస్తారు. దీంతో ఇక్కడ చదివితే కంప్యూటర్‌ సైన్స్‌లో సీటు దక్కదని భావిస్తున్న విద్యార్థులు ఏటా దాదాపు 300 మంది వరకు ఎంసెట్‌ రాసి రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరుతున్నారు. ఈ కారణంగా ఏటా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. వాటిని ఈసారి లేటరల్‌ ఎంట్రీ విధానం ద్వారా భర్తీ చేయనున్నారు.  ఈ విద్యాసంవత్సరం ఇంటీగ్రేటెడ్‌ బీటెక్‌లో సీట్ల భర్తీకి (పదో తరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి) ఒకటీ రెండు రోజుల్లో ప్రవేశాల ప్రకటన విడుదల చేయనున్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.