* మంత్రి హరీశ్రావు ప్రకటన
వైద్యరంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు జరగుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కొత్తగా ఎంపికైన 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు హరీశ్ నియామకపత్రాలు అందజేశారు. శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్య విద్యలో దేశంలోనే ఇది ఒక రికార్డు అని చెప్పారు. 80వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. 1,331 మంది ఆయుష్ కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించామన్నారు.
‘‘తెలంగాణ ఏర్పడిన తరువాత 22,263 మందికి ఆరోగ్యశాఖలో ఉద్యోగాలిచ్చాం. మరో 9,222 పోస్ట్లకు రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తాం. ఒక్కో మెడికల్ కాలేజీకి సుమారు రూ. 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ప్రతి లక్ష మందికి 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది’’ అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఇంటర్తో 1600 కేంద్ర కొలువులు
‣ సివిల్స్ ప్రిలిమ్స్కు తుది సన్నద్ధత
‣ బోధన ఉద్యోగాలకు తొలి మెట్టు.. నెట్
‣ ఇంటర్తో ఉపాధ్యాయ విద్య.. డీఎడ్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.