ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 1,180 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) సివిల్ పోస్టుల భర్తీకి మే 22న నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లోకల 83 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు దాదాపు 63 శాతం హాజరు నమోదైంది. ఉదయం జరిగిన పేపర్-1 పరీక్షకు 13,946 (62.89 శాతం) మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షకు 13,947 (62.90శాతం) మంది హాజరయ్యారు. మల్కాజిగిరి జిల్లా నాచారం మల్లాపూర్లోని భవానీ గ్రేస్ టెక్నాలజీస్ కేంద్రంలో పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి నుంచి సెల్ఫోను స్వాధీనపరచుకుని సీజ్ చేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఆ అభ్యర్థిపై మాల్ప్రాక్టీసు కేసు నమోదుచేసి పోలీసులకు అప్పగించామన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.