న్యూస్టుడే, కరీంనగర్ విద్యావిభాగం: సర్కారు బడుల్లో చదివి పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు రుసుంలతో సంబంధం లేకుండా కార్పొరేట్ స్థాయి (అత్యుత్తమ) జూనియర్ కళాశాలల్లో ఉచితంగా విద్యను పొందవచ్చు. పదోతరగతిలో 7 జీపీఏ, ఆపై జీపీఏలను సాధించిన విద్యార్థులకు ఆ కళాశాలల్లో రెండేళ్లపాటు ఉచిత విద్యను పొందేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది.
అర్హులు ఎవరంటే..
‣ ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 7 జీపీఏ, ఆపై జీపీఏలు సాధించిన విద్యార్థులు.
‣ ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్, ఆశ్రమ, సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎస్సీ వసతిగృహాలు, కేజీబీవీలు, నవోదయ విద్యాలయం, బెస్ట్ అవైలెబుల్ పథకం కింద చదివిన వారు.
‣ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులు.
‣ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలలోపు ఉన్న వారు.
‣ ప్రవేశం పొందిన విద్యార్థులకు వారికి కేటాయించిన కార్పొరేట్ కళాశాలల వివరాలను పంపిస్తారు.
దరఖాస్తు ఇలా..
దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా జూన్ 3వ తేదీలోపు చేసుకోవాలి. మీసేవా కేంద్రాల ద్వారా http:///telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా చేయాలి. పదో తరగతిలో సాధించిన జీపీఏ సర్టిఫికెట్, కులం, ఆదాయం ధ్రువపత్రాలు, బ్యాంకు పాస్బుక్, రేషన్ కార్డు నెంబరు, పాస్పోర్టు సైజు ఫొటో, ఆధార్కార్డును జత చేయాలి. దివ్యాంగులు వైకల్యానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని సమర్పించాలి. ఈమెయిల్ ఐడీ, చరవాణి నెంబరును దరఖాస్తులో పొందుపర్చాలి. ప్రభుత్వ షెడ్యూల్ కులాల వసతిగృహాల విద్యార్థులు మూడేళ్ల బోనఫైడ్ ధ్రువీకరణ పత్రాన్ని జతపర్చాలి. ఈ-పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు విద్యార్థులు ప్రాధాన్య క్రమంలో 3 కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.