గచ్చిబౌలి, న్యూస్టుడే: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మను) నిర్వహిస్తున్న పీహెచ్డీ, పీజీ, బీఈడీ, బీటెక్, డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువు మే 28 వరకు ఉండగా.. జూన్ 6 వరకు పొడిగించారు. విశ్వవిద్యాలయం ప్రవేశాల డైరెక్టరేట్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.వనజ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ప్రకటించిన విధంగానే జూన్ 20, 21, 22 తేదీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు. మెరిట్ ఆధారంగా నిర్వహించే ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు మాత్రం జులై 24 చివరి తేదీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.