• facebook
  • whatsapp
  • telegram

బడుల్లో ఐఎఫ్‌పీ, స్మార్ట్‌ టీవీలు: మంత్రి బొత్స

ఈనాడు, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులకు 30,213 ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానళ్లు, ప్రాథమిక బడుల్లో 10,038 స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేయనున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసన ఫలితాలను మెరుపర్చేందుకు కృషిచేస్తోందని వెల్లడించారు. విజయవాడలో మే 26న‌ ‘డిజిటల్‌ విద్యా విధానం- సాంకేతికతతో కూడిన బోధన, అభ్యసనం’పై జిల్లా స్థాయి రిసోర్సుపర్సన్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ బాటలో ఉపాధ్యాయులు ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు, మౌలిక సదుపాయాల కల్పన కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ పాల్గొన్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.