• facebook
  • whatsapp
  • telegram

EJS: ఈనాడు జర్నలిజం స్కూలు ఫలితాలు విడుదల

* మూడు విభాగాల్లో 83 మంది ఎంపిక

     


హైదరాబాద్‌: ఈనాడు జర్నలిజం స్కూలు కొత్త బ్యాచ్‌కు 83 మంది ప్రవేశార్హత సాధించారు.  మల్టీమీడియా, టెలివిజన్‌, మొబైల్‌ జర్నలిజం విభాగాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ ఏప్రిల్‌ నెలలో నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలను స్కూలు ప్రిన్సిపల్‌ జూన్ 15న‌ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న 617 మంది అభ్యర్థుల్లో 275 మంది బృంద చర్చలు, ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. వారిలో 83 మంది శిక్షణకు ఎంపికయ్యారు. వీరిలో 48 మంది మల్టీమీడియా,  30 మంది టెలివిజన్‌, ఐదుగురు మొబైల్‌ జర్నలిజం విభాగాలకు చెందిన వారు ఉన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఈనాడు జర్నలిజం స్కూలులో జూన్‌ 23వ తేదీన శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్‌ తెలిపారు. అభ్యర్థులకు వ్యక్తిగతంగా కూడా సమాచారం అందుతుంది.

     

ప్రవేశార్హత సాధించిన అభ్యర్థుల జాబితా.. 

Updated Date : 16-06-2023 9:52:05

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం