తెలంగాణ/ఏపీ, పంజాబ్, మహారాష్ట్రల నుంచే అత్యధికం
ఉన్నత చదువులపై తాజా నివేదిక వెల్లడి
దిల్లీ: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల్లో అత్యధికులు తెలంగాణ/ఏపీ, పంజాబ్, మహారాష్ట్ర వారే ఉన్నట్లు అక్టోబరు 27న విడుదలైన ‘బియాండ్ బెడ్స్ అండ్ బౌండరీస్, ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ-2023’ నివేదిక పేర్కొంది. ఇదివరకు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో చదవడానికి విద్యార్థులు ఎక్కువగా వెళ్లేవారని, ఇప్పుడు కొత్తగా జర్మనీ, కిర్గిజ్స్థాన్, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ దేశాల్లోనూ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. 2019లో దాదాపు 10.9 లక్షల మంది విదేశాల్లో విద్యనభ్యసించారని, 2022లో ఆ సంఖ్య 13.24 లక్షలకు చేరినట్లు వెల్లడించింది. ప్రస్తుతమున్న వృద్ధిరేటు 15 శాతం ఇలాగే కొనసాగితే 2025 నాటికి అది 20 లక్షలకు చేరుతుందని అంచనా వేసింది. మొత్తంగా ఏపీ/తెలంగాణ, పంజాబ్, మహారాష్ట్రల నుంచి 12.5 శాతం చొప్పున, గుజరాత్, తమిళనాడు, దిల్లీ/దేశ రాజధాని ప్రాంతం నుంచి 8 శాతం చొప్పున, కర్ణాటక నుంచి 6 శాతం, ఇతర రాష్ట్రాల నుంచి 33 శాతం మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నట్లు పేర్కొంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆ యుద్ధంతో ఆవిర్భవించిన మహా సామ్రాజ్యం!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.