• facebook
  • whatsapp
  • telegram

Job: 31న ఉమ్మడి కృష్ణాలో ఉద్యోగ మేళా

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా నిరుద్యోగులకు అక్టోబరు  31న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి.విక్టర్‌ బాబు తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ ఆవరణలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే జాబ్‌ మేళాలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, జియో కమ్యూనికేషన్స్‌తో పాటు బజాజ్‌ అలియాజ్‌, వరుణ్‌ మారుతీ, పద్మజ సుజుకీ, వరుణ్‌ బజాజ్‌ సంస్థల్లో ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18-27 ఏళ్ల మధ్య వయస్కులు అర్హులని వివరించారు. నిరుద్యోగులు పూర్తి బయోడేటా, ధ్రువపత్రాల జెరాక్స్‌ కాపీలతో పాటు ఆధార్‌ కార్డుతో హాజరుకావాలని కోరారు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం లభిస్తుందని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 81424 16211 నంబరులో సంప్రదించవచ్చన్నారు.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ కొలువు సాధనకు తొలి అడుగు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.