• facebook
  • whatsapp
  • telegram

Exams: పరీక్షల విధులు నిర్వహించే అధ్యాపకుల వివరాలు నమోదు చేయాల్సిందే

* తప్పుగా నమోదు చేస్తే జరిమానా

* ఇంటర్‌ విద్యామండలి హెచ్చరిక

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్‌, ప్రశ్నపత్రాల మూల్యాంకనం విధులు అప్పగించేందుకు అధ్యాపకుల వివరాలను నవంబరు 30 లోపు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఇంటర్మీడియట్‌ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. వారి అర్హతలు, ఫొటోలు, అనుభవం తప్పుగా నమోదు చేయడం, అసలు వివరాలు నింపకపోతే ఒక్కో అధ్యాపకుడికి రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. పరీక్షల విధులు అప్పగించిన అధ్యాపకులను పంపించడం కళాశాలల బాధ్యతని, దాన్ని ఉల్లంఘిస్తే ఒక్కో అధ్యాపకుడికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తామని వెల్లడించింది. అధ్యాపకుల విధులకు ఆన్‌లైన్‌లోనే నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొంది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ పీజీ విద్యార్థులకు పది వేల స్కాలర్‌షిప్పులు (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.