జిల్లాపరిషత్తు(గుంటూరు),న్యూస్టుడే: ఆధునిక వ్యవసాయవిధానాలు విద్యార్థులకు పరిచయం చేయడంతో పాటు యువతను వ్యవసాయ రంగంవైపు ఆకర్షింపజేసేందుకు గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాంలో అగ్రిటెక్ని డిసెంబరు 3, 4, 5 తేదీల్లో నిర్వహించనున్నామని ఆచార్య ఎన్. జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీదేవి నవంబరు 10న ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, పట్టు పరిశ్రమల శాఖలతో పాటు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, వివిధ వ్యవసాయ, వాణిజ్య సంస్థల సహకారంతో 2021, 2022లో అగ్రిటెక్ని విజయవంతంగా నిర్వహించారన్నారు. మూడో సంవత్సరం కూడా అగ్రిటెక్ని నిర్వహించి ఆధు నిక పరికరాల గురించి రైతులకు అవగాహన కల్పించి సేద్యంలో వాటిని వినియోగించేలా చూస్తామని వివరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పరిశోధనలతో వెలుగులు పంచుతూ..!
‣ కొలువుల జాతర.. రెండు వారాల్లో నోటిఫికేషన్ జారీ
‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.