* గతంలో అర్హులైన వారు ప్రస్తుతం ఎలా అనర్హులవుతారని ప్రశ్న
అమరావతి: ఏపీలో ఎస్ఐ నోటిఫికేషన్ ప్రక్రియపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. నియామకాల్లో అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఎత్తు అంశంలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని.. గతంలో అర్హులైన వారిని, ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషన్ వేశారు. బాధితుల తరఫున జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని బోర్డును జడ్జి ప్రశ్నించారు. ఈ సందర్భంగా నియామక ప్రక్రియను నిలుపుదల చేయాలని పిటిషనర్ కోరారు. దీంతో పిటిషనర్ వాదనలతో ఏకీభవించి ఉన్నత న్యాయస్థానం ఎస్ఐ నోటిఫికేషన్పై స్టే విధించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్టాక్ మార్కెట్లో చక్కని కెరియర్!
‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.