ప్రభుత్వం వింత పోకడ
ఈనాడు, అమరావతి: రాజీవ్గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్ఐటీల్లో ప్రభుత్వం వింతపోకడకు తెరతీసింది. ప్రభుత్వ ట్రిపుల్ఐటీల్లో డైరెక్టర్లుగా ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన వారిని నియమించింది. ఉన్నత విద్యలో కీలకంగా వ్యవహరిస్తున్న అధికారులకు పరిచయం ఉన్న ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను ట్రిపుల్ఐటీ డైరెక్టర్లుగా నియమించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రైవేటు వారికి కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలో ట్రిపుల్ఐటీలున్నాయి. గతంలో నియమించిన డైరెక్టర్ల పదవీకాలం పూర్తికావడంతో కొత్తగా నలుగుర్ని ఎంపిక చేస్తూ ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదించింది. ఒంగోలు ట్రిపుల్ఐటీకి తిరుపతిలోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన భాస్కర్ పాటిల్ను, శ్రీకాకుళం క్యాంపస్కు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కొక్కిరాల వీజీడీ బాలాజీని డైరెక్టర్లుగా నియమించింది. ఇడుపులపాయకు జేఎన్టీయూ, హైదరాబాద్కు చెందిన సీనియర్ ప్రొఫెసర్ ఏవీఎస్ఎస్ కుమారస్వామి గుప్తా, నూజివీడుకు వరంగల్ నిట్కు చెందిన ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ను నియమించింది. ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్లకు ప్రైవేటు వ్యక్తులను డైరెక్టర్లుగా ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.