• facebook
  • whatsapp
  • telegram

NMC: నీట్‌ యూజీ పరీక్షల్లో అర్హత ప్రమాణాల సవరణ

దిల్లీ: గుర్తింపు పొందిన బోర్డుల నుంచి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయో టెక్నాలజీతో పాటు అదనపు సబ్జెక్టుగా ఇంగ్లిషుతో 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నీట్‌-యూజీ పరీక్షకు అర్హులవుతారని జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) న‌వంబ‌రు 22న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో దరఖాస్తులు తిరస్కరణకు గురైన విద్యార్థులకు సైతం ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అభ్యర్థులు 11, 12 తరగతుల్లో రెండేళ్లు కచ్చితంగా ఇంగ్లిషుతో పాటు పై సబ్జెక్టులను క్రమం తప్పకుండా అధ్యయనం చేసి ఉండాలని ఎన్‌ఎంసీకి చెందిన అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు నోటీసులో పేర్కొంది.
 

సిలబస్‌ తగ్గింపు

నీట్‌-యూజీలో పాఠ్యాంశాలను తగ్గిస్తున్నట్లు జాతీయ పరీక్ష మండలి (ఎన్‌టీఏ) వెల్లడించింది. సీబీఎస్‌ఈ పాఠ్యాంశాల్లో జరిగిన మార్పులకు అనుగుణంగా నీట్‌-యూజీలోనూ సిలబస్‌ను హేతుబద్ధీకరించినట్లు తెలిపింది. వచ్చే ఏడాది మే 5న నిర్వహించే పరీక్షలోనూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. నవీకరించిన పాఠ్యాంశాల కోసం నీట్‌ వెబ్‌సైట్‌ను చూడాలని విద్యార్థులు, విద్యాసంస్థలను కోరింది.


మరింత సమాచారం... మీ కోసం!

‣ జేఈఈ మెయిన్‌ విజయానికి కీలకాంశాలు

‣ ఒకటే పరీక్ష.. లక్షన్నర కొలువులు!

‣ ఎయిమ్స్‌ సంస్థల్లో 3 వేల ఉద్యోగాలు

‣ స్టేట్‌ బ్యాంకులో 8,773 క్లర్క్‌ కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.