సంజీవరెడ్డినగర్, న్యూస్టుడే: బ్యాచ్లర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్స్స్ (బీఎన్వైఎస్) కోర్సులో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వ గాంధీ ప్రకృతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.వి.మల్లికార్జున్ తెలిపారు. మొత్తం 60 సీట్లు మంజూరయ్యాయని, ఇప్పటికే రెండు దశల్లో కొన్ని సీట్లు భర్తీ చేశామని తెలిపారు. ఐదున్నర ఏళ్ల ఈ కోర్సులో నాలుగున్నర సంవత్సరాలు చదువుతో పాటు ఒక సంవత్సరం ప్రకృతి చికిత్సాలయంలో హౌస్ సర్జన్గా పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. నీట్ అర్హత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. వీటిని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్స్లో ఆన్లైన్ ద్వారా సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు 70130 59535 సంప్రదించాలని తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జేఈఈ మెయిన్ విజయానికి కీలకాంశాలు
‣ ఒకటే పరీక్ష.. లక్షన్నర కొలువులు!
‣ ఎయిమ్స్ సంస్థల్లో 3 వేల ఉద్యోగాలు
‣ స్టేట్ బ్యాంకులో 8,773 క్లర్క్ కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.