* ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో జాతీయ విపత్తుల నిర్వహణ మండలి మార్గదర్శకాల మేరకు సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వానికి నవంబరు 23న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో సౌకర్యాలు కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ కె.అఖిల్ శ్రీగురుతేజ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలోని 3700 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో సుమారు 33 లక్షల మంది చదువుతున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అగ్నిమాపక చర్యలు, పరిశుభ్రమైన నీరు, పరిసరాల శుభ్రతలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను పొందాల్సి ఉందన్నారు. 2019లో జీవో జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలుకు 4 వారాల గడువు ఇస్తూ కార్యాచరణ నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జేఈఈ మెయిన్ విజయానికి కీలకాంశాలు
‣ ఒకటే పరీక్ష.. లక్షన్నర కొలువులు!
‣ ఎయిమ్స్ సంస్థల్లో 3 వేల ఉద్యోగాలు
‣ స్టేట్ బ్యాంకులో 8,773 క్లర్క్ కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.