• facebook
  • whatsapp
  • telegram

BRAOU: 11లోపు దూరవిద్య పీజీ ఫీజు చెల్లింపు

మాచవరం, న్యూస్‌టుడే: మాచవరం ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు వచ్చే నెల 11వ తేదీ లోపు పీజీ స్పెల్‌-2 (సప్లమెంటరీ)తో పాటు బీఎల్‌ఎస్‌సీ, ఎంబీఏ (పాత విద్యార్థులు), ఎంఎల్‌ఎస్‌సీ విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించాలని డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.అజంతకుమార్‌ తెలిపారు. రూ.500ల అపరాధ రుసుంతో వచ్చే నెల 16వ తేదీలోపు చెల్లించాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు, 27 నుంచి 31వ తేదీ వరకు పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని వివరించారు. మరిన్ని వివరాలకు 0866-2434868, 73829 29642 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. 


మరింత సమాచారం... మీ కోసం!

‣ భావితరాల క్షేమం కోరే ప్రగతి సుస్థిరం!

‣ ఐడీబీఐ బ్యాంకులో 2,100 కొలువులు

‣ నూతన ఆవిష్కరణలే ధ్యేయం!

‣ ‘ఏఐ’ ముప్పు తప్పేలా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.