మాచవరం, న్యూస్టుడే: మాచవరం ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు వచ్చే నెల 11వ తేదీ లోపు పీజీ స్పెల్-2 (సప్లమెంటరీ)తో పాటు బీఎల్ఎస్సీ, ఎంబీఏ (పాత విద్యార్థులు), ఎంఎల్ఎస్సీ విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించాలని డిప్యూటీ డైరెక్టర్ ఎం.అజంతకుమార్ తెలిపారు. రూ.500ల అపరాధ రుసుంతో వచ్చే నెల 16వ తేదీలోపు చెల్లించాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు, 27 నుంచి 31వ తేదీ వరకు పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని వివరించారు. మరిన్ని వివరాలకు 0866-2434868, 73829 29642 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భావితరాల క్షేమం కోరే ప్రగతి సుస్థిరం!
‣ ఐడీబీఐ బ్యాంకులో 2,100 కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.