• facebook
  • whatsapp
  • telegram

Nizam College: సెమిస్టర్‌ ఫీజు కడతాం.. పరీక్షలకు అనుమతివ్వండి

నిజాం కళాశాల విద్యార్థుల ఆందోళన
నారాయణగూడ, న్యూస్‌టుడే: సెమిస్టర్‌ పరీక్ష ఫీజు కట్టలేదన్న కారణంతో తమను పరీక్షకు అనుమతించలేదంటూ నిజాం కళాశాల విద్యార్థులు డిసెంబ‌రు 11న‌ ఆందోళనకు దిగారు. దీంతో కళాశాలలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పరీక్ష ఫీజు విషయంలో తమకు సమాచారం లేదని, దీనికి తోడు రకరకాల కారణాల వల్ల ఫీజులు కట్టలేకపోయామన్నారు. ఇప్పుడు ఫీజు కట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని, పరీక్ష రాసేందుకు అనుమతిని ఇవ్వాలని కోరితే కళాశాల సిబ్బంది ససేమిరా అంటున్నారని.. వైస్‌ ప్రిన్సిపాల్‌ను సంప్రదిస్తే ఇవ్వమని  చెప్పేశారని, గత్యంతరం లేక పరీక్షలను బహిష్కరించి ఆందోళనకు దిగామన్నారు.  రంగంలో దిగిన అబిడ్స్‌ పోలీసులు విద్యార్థులను సముదాయించారు.
హాస్టల్‌ కోసం ఆందోళన.. హాస్టల్‌ సమస్యను పరిష్కరించాలంటూ నిజాం కళాశాల పీజీ విద్యార్థినులు సోమవారం తరగతులు బహిష్కరించి నిరసన చేపట్టారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డా.బీమా కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. నిజాం కళాశాల విద్యార్థినుల హాస్టల్‌లో సరిపడా చోటు లేక తమకు సైఫాబాద్‌, సికింద్రాబాద్‌ పీజీ కళాశాలల్లోని బాలికల హాస్టళ్లలో గదులు కేటాయించారన్నారు. కానీ అక్కడ సరియైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రధానంగా ఒకో పడకపై ఇద్దరు, ముగ్గురు పడుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. తమను ఓయూ క్యాంపస్‌లోని హాస్టల్‌కు పంపించాలని వారు డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో కెరియర్ అవకాశాలు

‣ ఐడీబీఐ బ్యాంకులో 2,100 కొలువులు

‣ నూతన ఆవిష్కరణలే ధ్యేయం!

‣ ‘ఏఐ’ ముప్పు తప్పేలా!

‣ నాయకత్వ లక్షణాలు పెంచుకుందాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.