* యూజీసీ హెచ్చరిక
దిల్లీ: ఎంఫిల్(మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) డిగ్రీకి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక హెచ్చరిక చేసింది. ఈ డిగ్రీకి యూజీసీ గుర్తింపు లేదని, విద్యార్థులు ఇందులో చేరవద్దని స్పష్టం చేసింది. అంతేకాకుండా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఫిల్ ప్రవేశాలు నిలిపివేయాలంటూ అన్ని యూనివర్సిటీలను యూజీసీ ఆదేశించింది. ‘ఎంఫిల్ అడ్మిషన్ కోసం పలు యూనివర్సిటీలు దరఖాస్తులు కోరుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎంఫిల్ అనేది గుర్తింపు పొందిన డిగ్రీ కాదు. ఈ ప్రోగ్రామ్ను ఉన్నత విద్యా సంస్థలు నిర్వహించరాదంటూ యూజీసీ నిబంధనలు-2022 రెగ్యులేషన్ నంబర్ 14 స్పష్టంగా చెబుతోంది’ అని తాజా నోటీసులో యూజీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఫిల్లో ప్రవేశాల ప్రక్రియను నిలిపివేసే చర్యలు చేపట్టాలని యూనివర్సిటీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపింది. విద్యార్థులు ఇందులో అడ్మిషన్ తీసుకోవద్దని యూజీసీ సెక్రటరీ మనీశ్ జోషి సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.