* ఆర్సెట్ నుంచి మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి: పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించే ‘ఆర్సెట్’ నుంచి యూజీసీ నెట్, సీఎస్ఐఆర్-నెట్, గేట్, సీఈఈడీ, ఇతర జాతీయస్థాయి పరీక్షల్లో అర్హత సాధించినవారికి మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అర్హతలు కలిగిన వారికి విశ్వవిద్యాలయాలు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, ప్రవేశాలు కల్పిస్తాయి. మిగతా సీట్లను ఉన్నత విద్యామండలి నిర్వహించే ఆర్సెట్ ద్వారా భర్తీచేస్తారు. ఆర్సెట్ను 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రిసెర్చ్ మెథడాలజీకి 70, సబ్జెక్టుకు సంబంధించి 70, ఇంటర్వ్యూకు 60 మార్కులు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యుఎస్ వారికి ఆర్సెట్లో 45, ఇతరులకు 50 శాతం మార్కులను కనీస అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!
‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు
‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.