* ముగ్గురు పీహెచ్డీ విద్యార్థులకు ఖాళీ డిగ్రీ ధ్రువపత్రాలు
* జేఎన్టీయూ స్నాతకోత్సవంలో నిబంధనల ఉల్లంఘన
ఈనాడు, హైదరాబాద్: జేఎన్టీయూ అధికారులు ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో ముగ్గురు విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేయడం చర్చనీయాంశమైంది. 2024 జనవరి 5న జేఎన్టీయూలో జరిగిన పన్నెండో స్నాతకోత్సవంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరోజు 142 మంది పరిశోధక విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలను అందజేయగా వారిలో స్నాతకోత్సవానికి ముందురోజే పీహెచ్డీ పరీక్ష (వైవా) పూర్తిచేసుకున్న ముగ్గురు పరిశోధక విద్యార్థులూ ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వారికి ఖాళీగా ఉన్న ధ్రువపత్రాలతో డిగ్రీలు ఇచ్చారు. స్నాతకోత్సవంలో పట్టా స్వీకరించాలంటే ప్రత్యేకంగా కాన్వొకేషన్ రుసుం చెల్లించాలి. ఆ గడువు 2023 నవంబరు 30వ తేదీనాడే ముగిసింది. ఈ నేపథ్యంలో స్నాతకోత్సవం ముందురోజే పరీక్ష(వైవా) పూర్తి చేసుకున్న ఈ ముగ్గురు విద్యార్థులు పట్టా తీసుకోవడానికి ఎలా అర్హులు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొందరు ఉన్నతాధికారులు, పరీక్షల నిర్వహణ విభాగం అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విభాగాధిపతి డాక్టర్ ఎ.అరుణ కుమారిని వివరణ కోరగా ఆమె స్పందించలేదు.
నిబంధనలిలా..
సాధారణ రోజుల్లో పీహెచ్డీ పట్టా పొందేందుకు, స్నాతకోత్సవంలో తీసుకునేందుకు కొన్ని నిబంధనలున్నాయి. పీహెచ్డీ పరీక్షలు(వైవా) పూర్తయ్యాక పరిశోధన పూర్తయినట్లు వర్సిటీ అధికారులు ప్రకటిస్తారు. వారం రోజుల్లో పీహెచ్డీ అవార్డుకు అర్హులను వర్సిటీ అధికారికంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. పీహెచ్డీ ధ్రువపత్రం తీసుకున్న విద్యార్థులు కాన్వొకేషన్ రుసుం చెల్లించి స్నాతకోత్సవం రోజున వచ్చి పట్టా తీసుకుంటారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!
‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు
‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.