విజయవాడ (గవర్నర్పేట), న్యూస్టుడే : ఇంజినీర్లు దేశాభివృద్ధికి అవసరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను జనవరి19న ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగిన ప్రతిభను గుర్తించేందుకు కేఎల్ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షలు నిర్వహించడం హర్షణీయమన్నారు. అనంతరం ఫిబ్రవరి 2 నుంచి 5 వరకూ జరిగే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఆవిష్కరించారు. వైస్ ఛాన్సలర్ జి.పార్థసారథివర్మ మాట్లాడుతూ కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశం కల్పించేందుకు జాతీయ స్థాయిలో 3 సార్లు పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. ప్రస్తుతం మొదటి సారి నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ‘ఫిజిక్స్’ కోర్సులు
‣ ఎన్సీఎల్లో ట్రైనీ సూపర్వైజరీ పోస్టులు
‣ ‘నిక్మార్’ నిర్మాణ రంగ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.