షేక్పేట, న్యూస్టుడే: షేక్పేట సత్యాకాలనీలోని గోల్కొండ -1 మైనార్టీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో వచ్చే ఏడాదికి ఐదో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం(ఎంఎల్టీ, సీటీ)లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ డి.కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో ముస్లిం మైనార్టీలకు 41, క్రైస్తవులకు 5, సిక్కులు, బౌద్ధులు, పార్సీలకు ఒక్కోటి చొప్పున, నాన్ మైనార్టీలకు 20 సీట్లు, ఇంటర్లో ఎంఎల్టీలో మైనార్టీలకు 23, నాన్ మైనార్టీలకు 7 సీట్లు, సీటీలో మైనార్టీలకు 30, నాన్ మైనార్టీలకు 10 సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నటన్లు చెప్పారు. ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అన్ని వసతులతోపాటు, ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామని ఆయన వివరించారు. ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదని, నేరుగా చేరవచ్చని చెప్పారు. నాన్మైనార్టీలకు లాటరీ విధానంలో ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. వివరాలకు ఫోన్ నం.95053 72923, 81212 83180, 79950 57976లకు సంప్రదించాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ‘ఫిజిక్స్’ కోర్సులు
‣ ఎన్సీఎల్లో ట్రైనీ సూపర్వైజరీ పోస్టులు
‣ ‘నిక్మార్’ నిర్మాణ రంగ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.