1. 2100 నాటికి భారత్లో తగ్గనున్న వ్యవసాయ కూలీల ఉత్పాదకత
వాతావరణ మార్పుల వల్ల ఈ దశాబ్దం చివరినాటికి (2100) భారత్, పాకిస్థాన్ వంటి దేశాల్లో వ్యవసాయ కూలీల ఉత్పాదకత 40 శాతం మేర పడిపోవచ్చని అమెరికా పరిశోధకుల అధ్యయనం పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. గాజాలో గంటకు ఇద్దరు తల్లుల మృతి!
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో ప్రధాన బాధితులు స్త్రీలు, పిల్లలేనని ఐక్యరాజ్య సమితి మహిళా సంస్థ యూఎన్ వుమెన్ ప్రకటించింది. 100 రోజులుగా సాగుతున్న యుద్ధంలో 16,000 మంది మహిళలు, బాలలు మరణించారని తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఇరాన్ ఉపగ్రహ ప్రయోగం
ఇరాన్ సొరయా అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 50 కిలోల బరువైన ఈ ఉపగ్రహం భూమికి 750 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో ప్రవేశించిందని ఇరాన్ మంత్రి ఇసా జారేపౌర్ తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఒలింపిక్స్కు రయాజా, అనంత్
షూటర్లు రయాజా ధిల్లాన్, అనంత్ జీత్ సింగ్ నారుక ఒలింపిక్ కోటా స్థానాలు సాధించారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ షాట్గన్ టోర్నీలో తమ స్కీట్ ఈవెంట్లలో వాళ్లు రజతాలు గెలుచుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఆర్టీసీ ఉద్యోగుల ప్రమాద బీమా రూ.1.12 కోట్లకు పెంపు
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాదబీమా రూ.40 లక్షలు ఉండగా ఆ మొత్తాన్ని రూ.1.12 కోట్లకు పెంచేలా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)తో టీఎస్ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.