1. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
దేశరాజధాని దిల్లీలోని ‘కర్తవ్యపథ్’లో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్ను 13వేల మంది ప్రత్యేక అతిథులు ప్రత్యక్షంగా వీక్షించారు. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ పాల్గొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. తన్మయ్ ప్రపంచ రికార్డు
రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (323 బ్యాటింగ్; 160 బంతుల్లో 33x4, 21x6) ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేశాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. నైట్రోజన్తో మరణశిక్ష అమలు
నైట్రోజన్ గ్యాస్ వాడి తొలిసారిగా ఓ ఖైదీకి మరణశిక్ష అమలు చేశారు. హత్య కేసులో దోషిగా తేలిన కెన్నెత్ యూజీన్ స్మిత్ (58)పై అమెరికాలోని అలబామా రాష్ట్రంలో దీన్ని ప్రయోగించారు. దీంతో 1982లో విషతుల్య ఇంజెక్షన్ విధానాన్ని తెచ్చాక తొలిసారిగా అమెరికాలో మరో కొత్త మరణశిక్ష ప్రక్రియ వినియోగంలోకి వచ్చినట్లయింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. అంగారకుడిపై ముగిసిన ఇంజెన్యుటీ ప్రస్థానం!
అంగారక గ్రహంపైకి తొలిసారి అడుగుపెట్టిన హెలికాప్టర్ ‘ఇంజెన్యుటీ’ ప్రస్థానం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా అధికారికంగా ప్రకటించింది. భూమికి వెలుపల ఎగిరిన తొలి లోహ విహంగంగా ఇది రికార్డు సృష్టించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.