• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 28-01-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. సర్వోన్నత న్యాయస్థానానికి వజ్రోత్సవం

భారత సర్వోన్నత న్యాయస్థానం 75వ పడిలోకి అడుగుపెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2024 సినర్‌ సొంతం

టెన్నిస్‌లో కొత్త ఛాంపియన్‌ ఇటలీ కుర్రాడు జనిక్‌ సినర్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ విజేతగా నిలిచాడు. అయిదు సెట్ల మారథాన్‌ ఫైనల్లో అనుభవజ్ఞుడైన మెద్వెదెవ్‌పై అతడు పైచేయి సాధించాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3. బిహార్‌ సీఎంగా తొమ్మిదోసారి నీతీశ్‌

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరారు. 18 నెలల క్రితం వదిలేసిన కూటమిలోకి మళ్లీ వచ్చేందుకు వీలుగా తన పదవికి రాజీనామా చేసి, కాసేపట్లోనే తిరిగి సీఎంగా ప్రమాణం చేశారు. బిహార్‌ సీఎంగా ఆయన రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి బాధ్యతలు చేపట్టినట్లయింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4.ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్‌ అర్నాల్ట్‌

అంతర్జాతీయ విలాస వస్తువుల కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌ ఛైర్మన్, సీఈఓ బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ ప్రపంచ కుబేరుడిగా మారారు. టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5.ఉద్యోగుల పాత్రపై ఐరాస సెక్రటరీ జనరల్‌ ప్రకటన 

అక్టోబరు 7నాటి హమాస్‌ దాడుల్లో ఐరాస ఏజెన్సీ ‘యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ’ ఉద్యోగుల పాత్రపై ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ కీలక ప్రకటన చేశారు. ‘ఇజ్రాయెల్‌ చేసిన ఈ ఆరోపణలతో ఆందోళనకు గురయ్యా. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.