1. ఒడిశా శకటానికి మొదటిస్థానం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ‘కర్తవ్య్ పథ్’లో జనవరి 26న ప్రదర్శించిన శకటాల్లో ఒడిశా శకటానికి మొదటి బహుమతి దక్కింది. ప్రజల ఎంపిక విభాగంలో గుజరాత్ శకటం ప్రథమ స్థానాన్ని పొందింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రదర్శించిన శకటాల్లో ఉత్తమమైన వాటికి అవార్డులు ప్రదానం చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు పదేళ్ల జైలుశిక్ష
అధికారిక రహస్యాల వెల్లడి (సైఫర్) కేసులో పాకిస్థాన్ పూర్వ ప్రధాని ఇమ్రాన్ఖాన్ (71)కు, ఆయన మంత్రివర్గంలో విదేశాంగశాఖకు ప్రాతినిధ్యం వహించిన షా మహమ్మద్ ఖురేషీ (67)కి పదేళ్ల జైలుశిక్ష పడింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. రాజ్యసభకు సత్నామ్ సింగ్ సంధూ
పంజాబ్కు చెందిన విద్యావేత్త, చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు సత్నామ్ సింగ్ సంధూ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు తెలుపుతూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. బ్యాంకులను రైతులకు రుణసాయం పెంచమన్న నాబార్డు
వచ్చే ఆర్థిక (2024-25) సంవత్సరంలో బ్యాంకులు తెలంగాణ వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన రైతులకు రూ.1,33,587 కోట్ల రుణాలు ఇవ్వాలని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిబ్యాంకు (నాబార్డు) సూచించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. రిపబ్లిక్డే క్యాంపులో తెలుగు రాష్ట్రాలకు పది పతకాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఎన్సీసీ బృందం జాతీయస్థాయిలో ప్రతిభ చాటింది. అన్ని రాష్ట్రాల ఎన్సీసీ విద్యార్థులకు దిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే క్యాంపు పోటీల్లో.. బృందగాన విభాగంలో తెలుగు రాష్ట్రాల బృందం ప్రథమ బహుమతి గెలుచుకుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.