దిల్లీ: జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సులకు పేరొందిన ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్’ (ఐఐఎంసీ)కి డీమ్డ్ యూనివర్సిటీ స్థాయిని కల్పించాలని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నిర్ణయించింది. దీనివల్ల కేవలం డిప్లొమాలే కాకుండా డిగ్రీలు ప్రదానం చేసేందుకు, డాక్టొరల్ ప్రోగ్రాంలు అందించేందుకు ఈ సంస్థకు వీలుంటుంది. 1965లో కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలో దిల్లీ కేంద్రంగా ఏర్పాటైన ఐఐఎంసీకి జమ్మూ, అమరావతి (మహారాష్ట్ర), ఆయిజోల్, కొట్టాయం, ఢెంకనాల్లలో ప్రాంతీయ క్యాంపస్లు ఉన్నాయి. ఆంగ్లం, హిందీతో పాటు ఉర్దూ, ఒడియా, మరాఠీ, మలయాళంలలో జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సుల్ని ప్రస్తుతం అందిస్తోంది. డీమ్డ్-టు-బి-యూనివర్సిటీ స్థాయిని ఐఐఎంసీ పొందడం ఎంతో ప్రత్యేకం, చరిత్రాత్మకమని కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.