• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 04-02-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. ‘పద్మశ్రీ’ గ్రహీతలకు రూ.25 లక్షల నజరానా

దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు రెండో స్థానంలో ఉందని, తెలుగు వారికి పద్మ అవార్డులు దక్కడం గర్వకారణమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల నజరానా, ప్రతినెలా రూ.25 వేల పింఛను అందిస్తుందని ప్రకటించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2. పర్యావరణ న్యాయానికి అంతర్జాతీయ సహకారం కీలకం

వాతావరణ ముప్పును ప్రపంచం ఎదుర్కొంటున్న తరుణంలో అంతర్జాతీయ సహకారం కీలకమని అప్పుడే పర్యావరణ న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రాష్ట్రపతి దిల్లీలో జరిగిన కామన్వెల్త్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్, కామన్వెల్త్‌ అటార్నీ, సొలిసిటర్‌ జనరల్‌ సమావేశంలో ప్రసంగించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3. అంతరిక్షంలో అత్యధిక కాలం రష్యా కాస్మోనాట్‌ రికార్డు 

అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రష్యా కాస్మోనాట్‌ ఒలెగ్‌ కొనొనెంకో(59) రికార్డు సృష్టించారు.  2008 నుంచి ఇప్పటిదాకా అయిదుసార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) వెళ్లారు.  

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4. నమీబియా అధ్యక్షుడు గాంగోబ్‌ మరణం

నమీబియా అధ్యక్షుడు హాగే గాంగోబ్‌ (82) మరణించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన..  దేశ రాజధాని విండ్‌హక్‌లోని లేడీ పోహంబా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.