• facebook
  • whatsapp
  • telegram

EAPSET: మే 9 నుంచి 12 వరకు ఈఏపీసెట్‌  

* 26 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, వ్యవసాయం(అగ్రికల్చర్‌), ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌, పీజీఈసెట్‌ షెడ్యూళ్లను ఫిబ్రవరి 6న విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యామండలిలో జరిగిన షెడ్యూళ్ల విడుదల కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ కట్టా నర్సింహారెడ్డి, సెట్‌ కమిటీ ఛైర్మన్‌ ఎస్‌కే మహమూద్‌, ఈఏపీసెట్‌ కన్వీనర్‌ డీన్‌కుమార్‌తో పాటు శ్రీరాంవెంకటేశ్‌, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఏపీసెట్‌ కన్వీనర్‌ డీన్‌కుమార్‌ మాట్లాడుతూ..ఫిబ్రవరి 21న ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ వెలువడుతుందని, 26 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్‌ 6వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, మే 9వ తేదీ నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల ఎంసెట్‌ పేరును ఈఏపీసెట్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఇంటర్‌ అర్హతతో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ సీట్ల భర్తీకి ఈ పరీక్ష నిర్వహిస్తారు. అదే విధంగా పీజీఈసెట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను సైతం మంగళవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేశారు. మార్చి 12న పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల, మార్చి 16 నుంచి మే 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు, జూన్‌ 6వ తేదీ నుంచి 9 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ అరుణకుమారి తెలిపారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌, పీజీఈసెట్‌లను జేఎన్‌టీయూ నిర్వహిస్తోంది.

  తెలంగాణ ఈఏపీసెట్‌ స్టడీమెటీరియల్  
 

భౌతికశాస్త్రం
గణితశాస్త్రం
రసాయన శాస్త్రం
 వృక్షశాస్త్రం
జంతుశాస్త్రం


పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు
 

  ​​​​♦ నమూనా ప్రశ్నపత్రాలు  
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.