• facebook
  • whatsapp
  • telegram

JEE Main Key: జేఈఈ మెయిన్‌ కీ విడుదల

* రెస్పాన్స్ షీట్స్ కోసం క్లిక్ చేయండి
* తొలి విడత పేపర్‌-1కు 95.8 శాతం హాజరు

ఈనాడు ప్రతిభ డెస్క్‌: జేఈఈ మెయిన్‌ తొలి విడత (సెషన్‌ 1) పరీక్షల కీని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు ఈ పరీక్షలను నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ (NTA) మంగళవారం (ఫిబ్రవరి 6) రాత్రి ఈ కీని విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీలతో పాటు రెస్పాన్స్‌ షీట్‌లనూ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఈ కీపై అభ్యంతరాలు ఉంటే ప్రతి ప్రశ్నకు రూ.200 ఫీజుతో ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఛాలెంజ్‌ చేసే వెసులుబాటును కల్పించింది. చివరి విడత (సెషన్‌ 2) ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ఫిబ్రవరి 1వ తేదీకి జేఈఈ మెయిన్‌ తొలి విడత (సెషన్‌ 1) పరీక్షలు ముగియడంతో, సెషన్‌ 2కు దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ తెలిపింది. మార్చి 2వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చివరి విడత పూర్తయ్యాక.. రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు.

తొలి విడత పేపర్‌-1కు 95.8 శాతం హాజరు

ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన జేఈఈ మెయిన్‌ తొలి విడత పేపర్‌-1కు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరయ్యారని ఎన్‌టీఏ వెల్లడించింది. మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (బీప్లానింగ్‌) సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్‌-2 పరీక్షకు 74,002 మంది దరఖాస్తు చేసుకోగా.. 55,493 (75 శాతం) మంది హాజరయ్యారు.  


  జేఈఈ మెయిన్‌ ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్స్ కోసం క్లిక్ చేయండి  

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.